Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఅభివృద్దిజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : ఏషియాలోనే ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం

సూర్యాపేట : ఏషియాలోనే ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం

141 మున్సిపాలిటీలలో ఈ మార్కెట్ రోల్ మోడల్ గా నిలుస్తుంది

తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీధర్

సూర్యాపేట, మనసాక్షి :

ఏషియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందని మరో నెలలో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖా చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జమ్మిగడ్డలోని ఎస్ టి పి ప్లాంట్ ను, చివరి దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు.

 

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జమ్మిగడ్డలో ఎస్ టి పి ప్లాంట్ నిర్మాణం పూర్తి అయిందని అండర్ గ్రౌండ్ వద్ద పైప్ లైన్ వద్ద కనెక్షన్ ఇవ్వాల్సి ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఏషియాలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ఈ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారులకు అనుగుణంగా ఫ్లాట్ ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూలు, మటన్ అన్ని ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు అనుబంధంగా వెజ్, నాన్ వెజ్, ఫ్లవర్ మార్కెట్లతో పాటు క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్లలో ఇది రోల్ మోడల్ గా నిలుస్తుంది అన్నారు.

 

మరో నెల రోజుల్లో పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి, కోదాడ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, టి యుఎఫ్ ఐ డి సి ఎస్ ఇ వెంకటేశ్వర్లు, ఈఈ పీహెచ్ సత్యనారాయణ, ఈఈ జి కే డి ప్రసాద్, డి ఇ లు సత్య రావు, రమాదేవి, ఓ.స్వాతి ,ఏఈలు సుమంత్, వరుణ్ , నరేందర్ ,ఎస్.ఎస్.ఆర్ .ప్రసాద్ కాంట్రాక్టర్ కట్టా .వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు