Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..!
Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ ఆదర్శ పాఠశాలలో 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు తీవ్ర కడుపునొప్పి రావడం జరిగింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లడం జరిగింది. వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
5 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యలు.. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం…
నేనావత్ అనూష (9వ తరగతి ) ఉక్కర్ కర్ అనన్య (9వ తరగతి), ఇస్లావత్ అనూష (9వ తరగతి) వడ్త్య మంగ్త (6వ), సంపంగి ఉదయ్ (6వ తరగతి) విద్యార్థులకు గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విపరీతమైన కడుపు నొప్పి తో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహిస్తున్న బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, యు ఎస్ ఎఫ్ ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు..
ఇవి కూడా చదవండి :
-
CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!
-
TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!









