Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : రూ.1.25 లక్షలు పలికిన గణేష్ లడ్డు.. పంపిణీ చేసిన మాజీ మంత్రులు..!

Suryapet : రూ.1.25 లక్షలు పలికిన గణేష్ లడ్డు.. పంపిణీ చేసిన మాజీ మంత్రులు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని లడ్డూను భానుపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లడ్డూ వేలంపాట కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం బొడ్రాయి బజార్ కు చెందిన కొత్తూరు సందీప్ లక్ష ఇరవై వేల రూపాయలకు లడ్డును సోమవారం వేలం పాటలో దక్కించుకున్నారు.

మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటక0డ్ల జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా, ఘనంగా నిర్వహించుకోవడం హర్షనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్ మందిర అర్చకులు ధరూరి సింగరాచార్యులు ధరూరి రాఘవాచార్యులు భానుపురి ఉత్సవ సమితి అధ్యక్షుడు రంగరాజు రుక్మారావు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు భానుపురి ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

 

మరిన్ని వార్తలు