Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం.. కమనీయం..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల చారిత్రాక దేవాలయం శ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని సోమవారం తెల్లవారుజామున వేద పండితులు సూర్యనారాయణ శర్మ, సతీష్ శర్మ, బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం.. కమనీయం..!

వేములపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో గల చారిత్రాక దేవాలయం శ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని సోమవారం తెల్లవారుజామున వేద పండితులు సూర్యనారాయణ శర్మ, సతీష్ శర్మ, బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 300 మంది దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప మండలాల నుంచి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కాగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, సర్పంచులు, సందీప్, ఎలికట్టి భరత్, ఈవో మృత్యుంజయ శాస్త్రి, ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు