Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కీడొచ్చిందని ఊరంతా ఖాళీ..! 

Nalgonda : కీడొచ్చిందని ఊరంతా ఖాళీ..! 

వేములపల్లి, మన సాక్షి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం ఊరిలో దాదాపు పది నెలల నుండి 76 మంది చనిపోవడంతో గ్రామంలో పెద్దలు ఆచార్యవంతులు అన్ని కులాల పెద్దమనుషులు కలిసి పరిస్థితులను వివరించారు. ఊరికి కీడు వచ్చిందని జనం అంతా ఒకరోజు ఊరి వదిలి పెట్టి వెళ్ళాలి అని తెలియజేశారు. కీడు వచ్చిందని జనమంతా ఒకరోజు ఊరు వదిలిపెట్టి వెళ్లారు.

ఈ సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఈ మధ్యకాలంలో గ్రామంలోని ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని పూజారి దేశ గురువుని అడగగా ఆయన కీడు వచ్చిందని చెప్పడంతో మార్గం చెప్పమన్నారు. ఆయన సలహా మేరకు గ్రామస్తులంతా గురువారం ఉదయం సూర్యుడు ఉదయించే ముందుకే తెల్లవారుజాము నాలుగు గంటలకే ఊరి వదిలి శివారులోని పొలాల బాట పట్టారు. అక్కడే ఉండుకొని తిని సాయంత్రం సూర్యాస్తమరకు ఇంటికి చేరుకున్నారు

 

MOST READ : 

మరిన్ని వార్తలు