Telangana : ఆ కంపెనీ దగ్గర రూ.300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజం కాదా..?
Telangana : ఆ కంపెనీ దగ్గర రూ.300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజం కాదా..?
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణ
హైదరాబాద్, మన సాక్షి :
కాంగ్రెస్ ప్రభుత్వం పైన , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఇంకా ఉన్నాయని బయట పెడతానని పేర్కొన్నారు.
ఆయన కామెంట్స్ యధావిధిగా :
గత ప్రభుత్వ అవినీతి అక్రమాల పై నాలుగు నెలలు దాటిన ఒక్కదాని మీద ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు
అవినీతి అక్రమాల మీద సెటిల్మెంట్ లు చేస్తున్నారు
రేవంత్ అంటే నా వంతు ఎంది? అంటున్నాడు అంట
వెళ్లిన వాళ్లు రేవంత్ కి నీ రేటెంతా రెడ్డి అని అద్గుతున్నారంట
R టాక్స్ విధానంలో ఒక విధానాన్ని నేను ఈరోజు బయట పెడుతున్న
నగరం నడి బొడ్డున్న ఉన్న 15 ఎకరాల భూమిని హెటెరో కి ఇచ్చింది
గత ప్రభుత్వం 15 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముని 30 ఏళ్లకు నెలకు ఎకరానికి 2 లక్షల లీజ్ కి ఇచ్చారు
ఈ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది
ఏమైందో తెలీదు కానీ మళ్ళీ జీవో 37 విడుదల చేసి అదే భూమిని వాళ్ళకే కేటాయించారు
రేట్ పెంచాం అంటున్నారు ? ఎంత రేట్ పెంచారు ?
కేవలం 15లక్షల ?
Hetero దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజాం కదా?
గత ప్రభుత్వం లొసుగులు తెలుస్కొని సెటిల్మెంట్ చేసుకుంటున్నారు
అందుకే కాళేశ్వరం ను సీబీఐ కి అప్పజెప్పడం లేదు
వందల కోటల్లో ఇంత కుంభకోణం చేస్తే..కాళేశ్వరం ధరణి లో ఎంత కుంభకోణం చేస్తారో ?
నిజంగా మీకు వీటి మీద చిత్త శుద్ది ఉంటే వీటింగ్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి
మరో రెండు రోజుల్లో మరో అవినీతి అంశం పై ఆధారాలతో మీ ముందుకి వస్తా
సీఎం మహేశ్వర రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయని భయపడి 6th ఫ్లోర్ కి ఎవరిని రానివ్వకుండా సీఎం సెక్యూరిటీ పెంచారు
బట్టి కూడా సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరిని అనుమతించలేదని సమాచారం
రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి భయం చుట్టుకుంది
షిండే లేకుంటే కొడంగల్ లో రేవంత్ ఎందుకు అభద్రత భావంతో మాట్లాడారు ?
ALSO READ :
Telangana : రేవంత్ సొంత దుకాణానికి సిద్ధం.. భట్టిని సైడ్ చేసే ప్రయత్నం..!
Marakatha Shivalayam : కోరికలు తీర్చే కొంగు బంగారం మరకత శివాలయం..!
Bjp : రైతుల పంటలకు రుణమాఫీ లేదు.. 500 బోనస్ లేదు..!
BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!









