Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
రోడ్డుపై చెత్త వేసిన షాపు యజమానికి రూ.5000 జరిమానా.. ఎక్కడో తెలుసా..!
రోడ్డుపై చెత్త వేసిన షాపు యజమానికి రూ.5000 జరిమానా.. ఎక్కడో తెలుసా..!
శంకర్పల్లి, (మన సాక్షి) :
రోడ్డుపై చెత్త వేసినందుకు మున్సిపల్ అధికారులు షాపు యజమానికి 5000 రూపాయల జరిమానా విధించిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో దుకాణదారులు, పండ్లు కూరగాయల, ఇండ్ల యజమానులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ యోగేష్ నాయక్ హెచ్చరించారు. బుధవారం పట్టణ పరిధిలో మహేశ్వరి ధమాకా సేల్ షాపు యాజమాన్యం రోడ్డుపై చెత్త వేసినందుకుగాను మున్సిపల్ అధికారులు రూ. 5వేల జరిమానా విధించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మునిసిపల్ అధికారులు ప్రజలను కోరారు.









