సూర్యాపేట : మండుటెండలో తండ్రికి గొడుగు పట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : మండుటెండలో తండ్రికి గొడుగు పట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
హోదా కంటే బాధ్యత గుర్తెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి
సమాజానికి బాధ్యత గుర్తు చేసిన మంత్రి
సూర్యాపేట, మనసాక్షి
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి గా వ్యవహరిస్తున్న గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన తండ్రి పైన ఉన్న ప్రేమకు నిదర్శనమే తండ్రి రామచంద్రా రెడ్డి కి గొడుగు పట్టడం. మంగళవారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి రెవెన్యూ శివారు లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం లో మండుటెండలో తండ్రితో కలిసి వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగారు.
ఆసమయంలో మంత్రి జగదీష్ రెడ్డి తన తండ్రి పైన ఉన్న ప్రేమ తో తన చేతితో తండ్రికి గొడుగు పట్టి ఇద్దరు వ్యవసాయ క్షేత్రాములో తిరిగారు.. మంత్రి జగదీష్ రెడ్డి తనకు గుడుగు పెట్టాల్సిన అనుచర గాణనాన్ని పక్కపెట్టి తన తండ్రికి గుడుగు పట్టిన తీరు అందరిని విస్మయానికి గురిచేసింది.
డిల్లీ కి రాజు ఆయన తల్లి దండ్రికి కొడుకే అనే సామెతను మంత్రి జగదీష్ రెడ్డి సార్ధకం చేశారంటూ ఆ సీను చూసిన గ్రామ ప్రజలు ,అధికారులు అనుకుంటున్నారు.










