Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం
అకాల వర్షానికి అపార నష్టం..!
అకాల వర్షానికి అపార నష్టం..!
నేలకొండపల్లి, మన సాక్షి :
అకాల వర్షానికి అపార నష్టం. నేలకొరిగిన వరి పంట.. బోరున విలిపిస్తున్న రైతులు అకాల వర్షానికి నోటికొచ్చిన గింజ నేలపాలైందని రైతులు లబోదిబో మొత్తుకుంటున్నారు.
నెలకొండపల్లి మండలం లోని మంగాపురం తండా గ్రామంలో తేజావత్తు వెంకటేశ్వర్లు. తనకున్న మూడు ఎకరాల వారి పొలం వర్షానికి దెబ్బతినడంతో ఆ రైతు లబోదిబో అంటున్నాడు. వేల రూపాయలు ఖర్చుపెట్టి వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్న రైతుకు అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని తెలిపారు.
భారీ వర్షాలతో గ్రామాల్లో భారీగా వరి పంట పొలాలు దెబ్బతిన్నాయని వారిని వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన సహాయం సహకారం చేయాలని కోరారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని అధికారులనురైతులు కోరారు.
ALSO READ : BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!









