Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అడవుల్లో పోడు సాగు చేయొద్దని హెచ్చరిక..!
అడవుల్లో పోడు సాగు చేయొద్దని హెచ్చరిక..!
దమ్మపేట, మన సాక్షి :
అడవులను నరికి పోడుసాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు శివారులో వలస ఆదివాసీలు సాగుచేస్తున్న పోడుభూములను బుధవారం పరిశీలించారు.
పోడుసాగుదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడారు. అడవులను రక్షించడం ప్రతీఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ కోటేశ్వరరావు నీలమయ్య, భాస్కర్, వెంకన్న, పద్మ పాల్గొన్నారు.
ALSO READ : Inter Exams : నిమిషం ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు, గేటు బయట ముగ్గురు ఇంటర్ విద్యార్థులు..!









