Hospital : వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తె..!
Hospital : వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తె..!
దేవరకొండ, మనసాక్షి:
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్లైన్ ఓపి ఉండడం వలన స్థానికులకు ఇబ్బందిగా మారింది. రోజుకి వందలాదిమంది స్థానిక దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కు వైద్యం కోసం వచ్చి కాసురాజు పల్లి కంబాలపల్లి మారుమూల ప్రాంతాల నుండి వచ్చి ఓపి కోసం గంటలకు కొద్దిగా వేచి ఉంటూ సుమారు ఉదయం 8 గంటలకి బయలుదేరితే సమయానికి బస్సులు ఆటోలు లేకపోవడం వలన ప్రభుత్వాసుపత్రికి వచ్చే సరికి 10:30 పదకొండు గంటలకు వచ్చి ఓపి ఆన్లైన్ కోసం వేచి చూసి సమయం పన్నెండు అవడం జరుగుతుంది.
ఓపి తీసుకున్న తర్వాత సమయానికి డాక్టర్ లేకపోవడం వలన వైద్యం చేయించుకోలేక తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. వైద్య అధికారులు నిఘాబెట్టి సమయపాలనకు డాక్టర్లు వచ్చే విధంగా ఆన్లైన్ ఓపి తీసేసి నార్మల్ ఓపి ఉంచాలని స్థానికులు ఆరోపించారు ఆస్పత్రి సూపర్డెంట్ పట్టించుకోకపోవడం వలనే సమయపాలన పాటిస్తలేరని స్థానికులు ఆవేదనం గురించి వ్యక్తం చేశారు.










