30న రెండో విడత రుణమాఫీ..!
30న రెండో విడత రుణమాఫీ..!
సూర్యాపేట, మనసాక్షి
రెండో విడత రుణమాఫీ సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుంచి లక్ష 50 వేల వరకు ఉన్న పంట రుణం మాఫీ చేయబడుతుంద ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 30వ తారీకు రోజున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించి అదే రోజున అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు లబ్ధి పొందిన రైతులతో పండగ వాతావరణం లో నిర్వహించబడుతుంది కావున ప్రజాప్రతినిధులు , లబ్ధి పొందిన రైతులు, అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరు కాగలరని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ :
Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!
Srisailam : శ్రీశైలంకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద.. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో.. Latest Update
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!









