తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Jagdeesh Reddy : రైతులు అంతా ఐక్యం కావాలి.. మేము అండగా ఉంటాం..!

Jagdeesh Reddy : రైతులు అంతా ఐక్యం కావాలి.. మేము అండగా ఉంటాం..!

నలగొండ, మన సాక్షి :

గ్రామాలలో రైతులంతా ఏకం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేయాలి. మేము అండగా ఉంటాం అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు

నల్గొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది రాక్షసులను తరిమికొట్టినం, కేసీఆర్ ముందు ఇవి ఏవి నడవవు, కేసీఆర్ శిఖరం లాంటి వారు,
రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ..ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టిందన్నారు.

మేము అహింస పద్ధతుల్లో ఉద్యమం నడిపాము.. తెలంగాణ ఉద్యమం లో హింస లేపి ఉద్యమాన్ని అణిచివేయలని ఎన్నో కుట్రలు చేశారు అప్పట్లో. ఇవ్వాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు కాంగ్రెస్ వాళ్లు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారు. మొదట 49 వెల కోట్లతో చేస్తాం అన్నారు. 50 లక్షల మంది రైతులు అన్నారు..

ఆ తర్వాత 31వెల కోట్లు అని క్యాబినెట్ లో చెప్పారు. ఆతర్వాత 27 వేల కోట్లు అని చెప్పారు అని విమర్శించారు. అవి అన్ని మాట తప్పి ఇవ్వాళ 17 వెల కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువునా మోసం చేశారు. ఇవ్వాళ రైతులు తిరగబడుతున్నారు కాబట్టి సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. కావాలని ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ ప్రయత్నం.

ఇది అంతా రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ మిమ్ములను దాగా చేస్తుంది. మోసం చేసిందన్నారు. రేవంత్ అనేటోడు బీజేపీ తో దొంగ సంభదాలు పెట్టుకున్నడు. రేవంత్ బీజేపీ తో కుమ్మక్కు అయ్యాడు. రేవంత్ ఆంటోడు అల్ప జీవి. బి ఆర్ ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు దొంగ లాగా బీజేపీ తో మిలాఖత్ అయ్యావ్ మేము కాదు. సమస్యను పక్కదారి పట్టించుడు లో రేవంత్ సిద్ధహస్తుడు.

రాష్ట్రంలో హింస ప్రేరేపించాలి అని రేవంత్ ప్రయత్నం చేస్తోండు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసం పచ్చి అబద్ధo.  అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అన్నదాతలు ఆవేదన పడుతున్నారు. రుణాలు ఇచ్చేటప్పుడే అన్ని పత్రలు సరిచూసుకునే రుణాలు ఇస్తారు. మరి ఇప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టి రైతులను ఎడిపిస్తున్నారు అని ప్రశ్నించారు.

ఇవ్వాళ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఇంతకు మించిన ద్రోహం ఇంకోటి ఉండదురైతుల్లారా అర్థం చేసుకోండి కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి. బీఆర్ఎస్ రైతుల తరపున కొట్లాడుతుంది. మేము అండగా ఉంటాము. ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలి. అందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలి అన్నారు.

జిల్లాలో అన్ని పార్టీలకు జిల్లా కార్యాలయంలో ఉన్నాయని అన్ని నినిబంధనలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టమని దేవాలయంలో లాంటి పార్టీ కార్యాలయాన్ని కూలగొడతామని హెచ్చరించడం సమంజసం కాదన్నారు.

సమావేశంలో. శాసనమండలి సభ్యులు ఎం సి కోటిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, చీరా పంకజ్ యాదవ్,కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి,రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా,తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్,

మైనం శ్రీనివాసపట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కనగల్, నల్లగొండ, తిప్పర్తి, మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య,దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి ,లొడంగి గోవర్ధన్.. ఎడవల్లి సింగిల్విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి,కడారి కృష్ణయ్య బడుపుల శంకర్,వనపర్తి నాగేశ్వరరావు, పేర్ల అశోక్,బిపంగి కిరణ్, బొజ్జ సైదులు, కంచర్ల విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

PDS : రాత్రి వేళ తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!

 

మరిన్ని వార్తలు