నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!
నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బొల్లిగుట్ట తండా శివారు మెయిన్ రోడ్ పై లారీని ఢీ కొట్టి ఇద్దరు యువకులు మృతి చెందినారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఆదివారం సుమారు 11:15 రాత్రి గంటల సమీపంలో గిరిజనగర్ తండా కు చెందిన ఇస్లావత్ నరేష్ ( 21 ), సభావాత్ తండాకి చెందిన సభావాత్ రాహుల్ (18 ) ఇద్దరు డిజె ఆపరేటర్ గా పని చేస్తూ వారి డీజే పని ముగించుకొని డీజే బండిని రవీంద్ర నగర్ తండాలో ఉన్న ఓనర్ కి అప్పజెప్పి టూ వీలర్ పై వారి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొడ్డుకుంట తండా శివారు మెయిన్ రోడ్డు పై ప్రమాదం జరిగింది.
రోడ్డుపై ఏపీ 16 టి ఈ 5575 నెంబర్ గల లారీ రోడ్డుపై ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా పార్కింగ్ లైట్లు వేయకుండా నిలిపి ఉంచగా అట్టి లారీని వారు వెనుక నుండి ఢీకొట్టగా నరేష్ నువ్వు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి నందు మృతి చెందాడు.
రాహుల్ మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ తరలించగా వెలెనెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ చనిపోయాడు. లారీ డ్రైవర్ పై దేవరకొండ సీఐ నరసింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









