Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్

District collector : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..!

District collector : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..!

కొల్చారం, మన సాక్షి :

మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని, కోల్చారం మండలకేంద్రంలో లోని పరిసరాలను శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగుల తో మాట్లాడారు మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న 72 గంటలలో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు.

మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అంటు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్, డెంగు, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు.

నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా,
చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇండ్లల్లో నీటి నిలువలు లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకోవలాన్నారు. ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.

వారానికి ఒక సారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలనీ, ఇండ్ల లో వాడే కూలర్స్, ఫ్రీజ్, ఏ సీ లలో నీరు నిల్వ లేకుండా ఎపటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో లార్వాను గుర్తించి ఇలాంటి వాటివల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగీ ,టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు.

వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దార్ గఫార్ మియా, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Jagdeesh Reddy : రాష్ట్రంలో డెకాయిట్ల పాలన.. మంత్రి ఉత్తమ్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు