వర్షం నీటిలో బాలుడి దుర్మరణం..!
వర్షం నీటిలో బాలుడి దుర్మరణం..!
షాద్ నగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ నొబుల్ పార్క్ కాలనీలో వర్షం నీటిలో పడి 13 నెలల బాలుడు ఆరిఫ్ మన్సూర్ మృత్యువాత పడ్డాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతుల కుమారుడైన 13 నెలల ఆరిఫ్ పిల్లలతో కలిసి వర్షం నీటిలో గంతులు వేస్తూ నీళ్లలో పడి చనిపోయాడు.
తండ్రి మీర్ అహ్మద్ వాచ్ మెన్ గా నోబుల్ పార్క్ లో పనిచేస్తున్నాడు. పోట్టకూటికోసం వలస వచ్చిన ఈ దంపతులు కుమారుడి మరణంతో కన్నీటి సంద్రమై శోఖిస్తున్నారు. నీళ్లలో పడ్డ తర్వాత ఆరిఫ్ ను రక్షించుకుందామని వెంటనే ప్రభుత్వాసుపత్రికి పరిగెత్తిన ఫలితం లేకపోయింది.
అప్పటికే చిన్నారి ఆరిఫ్ మృత్యువాత పడ్డాడు. బాలుడు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు అక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ సంఘటనపై స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని పేర్కొంటున్నారు.
LATEST UPDATE :
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!
Help Line : భారీ వర్షాలకు.. హెల్ప్ లైన్ నెంబర్ 8712656760..!










