Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని, గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గూడూరు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలంలోని గూడూరు వద్ద ఉన్న ఐఓసి పెట్రోల్ బంకు సమీపంలో నల్గొండ నుండి గుంటూరు వైపు వెళ్తూ గుర్తుతెలియని మహిళ (70) ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె వంకాయ కలర్ చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉంది. తెల్లని జుట్టు కలిగి ఉంది. మృతురాలి గుర్తు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు 8712670189, 9712690151 కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు