Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!

Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుపై రైతులందరికీ ప్రభుత్వం అదిరిపోయాయే గుడ్ న్యూస్ తెలియజేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పై కీలకమైన ప్రకటన జారీ చేశారు.

రైతులకు బడ్జెట్లో 35 శాతం నిధులు కేటాయించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పంటలు నష్టపోయిన సమయంలో ఎకరానికి 10,000 రూపాయలు అందించే విధంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా ఎన్నికల సమయంలో రైతు బంధు పథకాన్ని కేసీఆర్ ఇవ్వలేదని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వెంటనే రైతు బంధు పథకం ద్వారా 7625 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా రైతు భరోసా పథకం సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని, అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు. రైతు భరోసా పథకంతో పాటు రైతులకు బోనస్ కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు