తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

Chaina Manza : ఇద్దరి ప్రాణాల మీదికి వచ్చిన చైనా మంజా..!

Chaina Manza : ఇద్దరి ప్రాణాల మీదికి వచ్చిన చైనా మంజా..!

నిజామాబాద్ జిల్లా : భీంగల్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజా ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. నవీపేట మండలానికి చెందిన అద్వాన్ అనే యువకుడికి చైనా మాంజా తగలడంతో గొంతు తెగింది.

అంతేగాక మోర్తాడ్ మండలానికి చెందిన గుజ్జేటి ప్రవీణ్(35)కు మాంజాతో గొంతు కోసుకుపోయింది. దీంతో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, అటవీశాఖ, పోలీసులు పతంగుల దుకాణాలపై దాడులు చేసినప్పటికీ చైనా మాంజా విక్రయాలు ఆగలేదు.

చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు