Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా
ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి..!
ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి..!
టేక్మాల్, మన సాక్షి:
ప్రమాదవశాత్తు కాలుజారి చేరువు లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన టేక్మాల్ మండల పరిధిలోని హస్సన్ మమ్మద్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అనిల్ (25) కులిపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అనిల్ రాత్రిపూట కాలకృత్యాలకు చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఊపిరాడక మృతి చెందాడు.
ఎంతసేపటికీ తన కొడుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బంధువులు చుట్టూపక్కల వెతుకుతూండగా చెరువు దగ్గరకు వెళ్లి చూడగా మొబైల్ ఫోన్ (పర్సు) కనపడడంతో గ్రామస్తులకు తెలపగా చెరువులో గాలించగా. అనిల్ చనిపోయి శవమై కనిపించాడు. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్సై తుక్కయ్య కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MOST READ :
-
District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!
-
Nalgonda : వ్యవసాయ యోగ్యం కానీ భూముల పరిశీలన పక్కాగా చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
CM Revanth Reddy : సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘనంగా తెలుగువారి స్వాగతం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!









