Maha Kumbha mela : మహా కుంభమేళా లో అపశృతి.. ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట..!
Maha Kumbha mela : మహా కుంభమేళా లో అపశృతి.. ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మహా కుంభమేళాలో బుధవారం అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో త్రివేణి సంగమం వద్ద భక్తులు కిటకిటలాడారు. అర్ధరాత్రి నుంచే కోట్లాదిమంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు వెళ్లారు. దాంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనలో 20 మంది భక్తులు మృతి చెందినట్లు సమాచారం. మరి కొంతమందికి గాయాలయ్యాయి. కాగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం ఒక్కరోజే ప్రయాగ్రాజులో 10 కోట్ల మంది భక్తులు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహా కుంభమేళ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
MOST READ :
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!
-
గ్రామ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. రికార్డులను పరిశీలించిన డిఎల్పివో..!
-
Suryapet : నా భర్త నాకు కావాలి.. అత్తింటి ముందు కోడలు ధర్నా..!
-
Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!









