Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి (కాంగ్రెస్) కొనసాగుతున్నారు.
అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. అదే విధంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ స్థానం ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవి కాలం మార్చి 29వ తేదీతో ముగియనున్నందున ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాలలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది.
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..!
-
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
-
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
-
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
-
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13
-
పోలింగ్ – ఫిబ్రవరి 27 (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
-
ఓట్ల లెక్కింపు – మార్చి 3
MOST READ :
-
Maha Kumbha mela : మహా కుంభమేళా లో అపశృతి.. ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Liquor : కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు అరెస్ట్.. ముగ్గురు బైండోవర్..!
-
Hyderabad : ఎక్స్ పీరియం పార్కును చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయా.. చిరంజీవి
-
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!









