క్రైంBreaking Newsజిల్లా వార్తలుమెదక్
TG News : రెండు కార్లు ఢీకొని.. ఘోర ప్రమాదం..!
TG News : రెండు కార్లు ఢీకొని.. ఘోర ప్రమాదం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. మెదక్ జిల్లాలో రెండు కార్లు ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట గేటు వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వైపుకు వెళుతున్న ఆల్టో కారు కు ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.
ప్రమాదంలో ఆల్టో కార్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఎండి గౌస్, అలీ, అజీం బేగంగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Food Safety Officers : ఫుడ్ సేఫ్టీ అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు.. బేకరీ తనిఖీ చేసిన అధికారులు..!
-
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!









