Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : క్రీడాకారులకు టోకెన్లు ఇచ్చారు.. తీరా సమయానికి భోజనం లేదని చెప్పారు..!

Nalgonda : క్రీడాకారులకు టోకెన్లు ఇచ్చారు.. తీరా సమయానికి భోజనం లేదని చెప్పారు..!
నల్గొండ, మన సాక్షి
నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం లో ఏర్పాటుచేసిన పీఎం శ్రీ క్రీడల సెలక్షన్లలో విద్యార్థులకు కనీస భోజన ఏర్పాట్ల సౌకర్యం కల్పించలేదని విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశామని టోకెన్లు ఇచ్చి తర్వాత మధ్యాహ్న సమయానికి భోజనాలు లేవని చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భోజనాలు లేవన్న సంగతి మాకు ముందే చెప్పాలని తీరా సమయానికి భోజనాలు లేవని చెప్పడంతో మేము ఎక్కడికి వెళ్ళాలని విద్యార్థులు అక్కడే మొరాయించి దీక్షకు దిగారు. మేనేజ్మెంట్ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో యజమాన్యంపై విమర్శలకు చేశారు. పండ్లు ఇప్పిస్తాం అని మేనేజ్మెంట్ చెప్పగా విద్యార్థులు వాటిని తీసుకోవడానికి నిరాకరించి గ్రౌండ్లో కూర్చొని నిరసన తెలిపారు.
MOST READ NEWS :
-
SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!









