Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్
NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!
నూతన సంవత్సర వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని జీడిమెట్లలో విషాదకరమైన సంఘటన జరిగింది. జీడిమెట్ల లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భవాని నగర్ లో నూతన సంవత్సరం పురస్కరించుకొని 17 మంది వేడుకలు జరుపుకున్నారు.

NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!
మన సాక్షి, హైదరాబాద్ :
నూతన సంవత్సర వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని జీడిమెట్లలో విషాదకరమైన సంఘటన జరిగింది. జీడిమెట్ల లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో భవాని నగర్ లో నూతన సంవత్సరం పురస్కరించుకొని 17 మంది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారంతా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివిధ కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ NEWS :
-
Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!
-
TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!
-
WhatsApp : వాట్సాప్లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!









