Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందం దాడులు.. సిలిండర్ల పట్టివేత..!

Miryalaguda : మిర్యాలగూడలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందం దాడులు.. సిలిండర్ల పట్టివేత..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ కారణంగా గ్యాస్ నిలువలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వ్యాపార సముదాయాలకు వినియోగించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించారు.

గృహ వినియోగం చేసే సిలిండర్లను హోటల్, రెస్టారెంట్లలో, టీ స్టాల్స్ లో వినియోగించడం పై తనిఖీలు నిర్వహించారు. దాంతో పట్టణంలోని మంజీర బార్ అండ్ రెస్టారెంట్ లో ఆరు సిలిండర్ లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. సివిల్ సప్లై యాక్ట్ ప్రకారం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు