Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!

మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు గత కొంతకాలంగా రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు అర్థరాత్రి దాడి చేసి పట్టుకున్నారు.

Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!

కరీంనగర్, మనసాక్షి :

మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు గత కొంతకాలంగా రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు అర్థరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణం శుభాష్ నగర్ లోని రెడ్డి హాస్టల్ సమీపంలో ఓ ఇంట్లో 17 మంది వ్యక్తులతో కలిసి పేకాట ఆడుతున్నారని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి పేకాట రాయుళ్లని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 6,75,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారిలో రైస్ మిల్లు నిర్వాహకుల అసోసియేషన్ సభ్యులు, తిమ్మపూర్ మండలానికి చెందిన సర్పంచులు, అధికార పార్టీ నాయకులు, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖులు, విలేకరులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

పేకాట రాయుళ్లు పట్టుబడ్డ ప్రదేశం 3 టౌన్ పరిధిలోకి వస్తుంది అని పై అధికారులు ఆదేశించడంతో వారి సూచన మేరకు రూరల్ పోలీసులు ఈ కేసును 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. 3 టౌన్ పోలీసులు ఇప్పటి వరకు ఈ ఘటన పై గంటలు గడుస్తున్నా వ్యక్తుల వివరాలు, డబ్బు వివరాలు, ఇతర సమాచారం గోప్యంగా ఉంచడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ కేసు నుంచి తప్పించాలంటు పోలీసులకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు