Madgulapally : ధాన్యం తూకాల్లో మోసం.. క్వింటాకు 4 నుంచి 6 కిలోల కోత..!
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో తిప్పర్తి పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు.

Madgulapally : ధాన్యం తూకాల్లో మోసం.. క్వింటాకు 4 నుంచి 6 కిలోల కోత..!
విలేకరుల ఎదుట రైతుల ఆవేదన
మాడుగులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో తిప్పర్తి పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల వద్ద ఒక్కో క్వింటాకు ఏకంగా 4 నుంచి 6 కిలోల వరకు అక్రమంగా కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని పత్రికా విలేకరుల ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కొనుగోలు కేంద్రంలో ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకపోగా, ఇలా తూకాల్లో బహిరంగంగా మోసాలకు పాల్పడితే తాము అప్పుల పాలై రోడ్డున పడాల్సిందేనని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఇందుగుల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు విధులకు గైర్హాజరవుతున్న పీఏసీఎస్ సిబ్బందిపై, తూకాల్లో కోత విధించే వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతాంగం కోరుతోంది.
MOST READ :









