Breaking Newsఆంధ్రప్రదేశ్విద్య
SSC : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించగా మొత్తం 464 మంది విద్యార్థులు హాజరయ్యారు.

SSC : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించగా మొత్తం 464 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 408 మంది ఉత్తీర్ణత సాధించగా, 56 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మండలంలో మొత్తం 88 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఎంఈఓలు హేమలత, ఆంజనేయులు తెలిపారు.
మెరిట్లో చెంబకూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎస్. పవన్ కుమార్ 600లో 564 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏపీ మోడల్ స్కూల్కు చెందిన టి. వైష్ణవి 560 మార్కులతో ద్వితీయ స్థానం, అరికెల ప్రభుత్వ పాఠశాలకు చెందిన కే. అమృత వర్షిని 557 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.వీరిని మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అభినందనలు తెలిపారు.









