Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : తక్కెళ్ళపాడులో పది ఎకరాల గడ్డివాము దగ్ధం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తక్కలపాడు గ్రామంలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం అయిన సంఘటన చోటుచేసుకుంది.

Miryalaguda : తక్కెళ్ళపాడులో పది ఎకరాల గడ్డివాము దగ్ధం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తక్కలపాడు గ్రామంలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం అయిన సంఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెలపాడు గ్రామానికి చెందిన చౌగాని బిక్షం కు చెందిన పది ఎకరాల వ్యవసాయ పొలానికి సంబంధించిన గడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. కాగా ఆ సమయంలో తడకమళ్ళ గ్రామానికి చెందిన గబ్బిలాల ఎల్లయ్య గడ్డివాము నుండి బయటకు రావడం చూసి అనుమానం వ్యక్తం చేసి అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా ఈ విషయంపై ఎటువంటి రాజకీయ ప్రతీకార చర్యలు లేవని, విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.









