Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

PhonePe : ఫోన్ పే వినియోగదారులకు భారీ శుభవార్త.. సిఈఓ సంచలన ప్రకటన..!

డిజిటల్ పేమెంట్స్ పై చార్జీలు వసూలుకు సంబంధించిన బిల్లు లోక్ సభ లో బిల్లు ఆమోదం పొందడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఫోన్ పే లావాదేవీల పై చార్జీలు వసూలు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ పే సీఈవో ఫోన్ పే వినియోగదారులకు భారీ శుభవార్తను తెలియజేశారు.

PhonePe : ఫోన్ పే వినియోగదారులకు భారీ శుభవార్త.. సిఈఓ సంచలన ప్రకటన..!

మన సాక్షి, వెబ్ డేస్క్ :

డిజిటల్ పేమెంట్స్ పై చార్జీలు వసూలుకు సంబంధించిన బిల్లు లోక్ సభ లో బిల్లు ఆమోదం పొందడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఫోన్ పే లావాదేవీల పై చార్జీలు వసూలు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ పే సీఈవో ఫోన్ పే వినియోగదారులకు భారీ శుభవార్తను తెలియజేశారు.

దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తున్న యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపులపై ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్ పే సీఈవో వెల్లడించారు. యూపీఐ లావాదేవీల పై చార్జీల వసువులకు సంబంధించి లోక్ సభ బిల్లు ఆమోదం పొందింది. దాంతో డిజిటల్ పేమెంట్స్ పై చార్జీలు వసూలు చేస్తారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగం అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. యుపిఐ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగా కొనసాగించడమే ముఖ్యమని, డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

యూపీఐ లావాదేవీలపై ఎండియర్ విధించేందుకు చట్టపరమైన అవకాశం కల్పించే మార్కులపై ప్రస్తుతం చర్చ జరుగుతుందని, అయితే రుసుము విధించే తుది విధానం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని ప్రతిపాదనలో నిర్దిష్ట విలువకు మించిన లావాదేవీలు లేదా నిర్దిష్ట వార్షిక వ్యాపారులపై మాత్రమే రుసుము విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

Similar News :: 

మరిన్ని వార్తలు