KCR : నర్సంపేటకు బయలుదేరిన బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్..!
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో, శోకతప్త హృదయులై, కష్టకాలంలో ఉన్న వారి భార్య బిడ్డలను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వచ్చేందుకు.. ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు బయలుదేరారు.

KCR : నర్సంపేటకు బయలుదేరిన
బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్..!
ఉద్యమకాల సహచరుడు, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడు, ఆత్మీయుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో, శోకతప్త హృదయులై, కష్టకాలంలో ఉన్న వారి భార్య బిడ్డలను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వచ్చేందుకు.. ఎర్రవెల్లి నివాసం నుంచి నల్లబెల్లికి బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు బయలుదేరారు.
బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ వెంట పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర , మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు జి. జగదీశ్వర్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , కల్వకుంట్ల సంజయ్ , పాడి కౌశిక్ రెడ్డి , అనిల్ జాదవ్ , గంగుల కమలాకర్ , మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీలు , రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , యాదవరెడ్డి , శంభీపూర్ రాజు , శేరి సుభాష్ రెడ్డి , క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.









