Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు.. రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్..!

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు.. రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్..!

రామసముద్రం, మన సాక్షి :

రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగడానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మదనపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రామసముద్రం మండలానికి విచ్చేసిన ఆయన మండల కేంద్రంలో ని ఎంపిడివో కార్యాలయంలో స్థానిక ఎంపిడిఓ , తహశీల్దార్, ఎస్సై తో పాటు బూత్ లెవల్ అధికారులతో ఎన్నికలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజున ఏ ఆటంకాలు జరుగకుండా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వి నియోగించుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులను ఆదేశించారు.అలాగే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పోలింగ్ రోజున అల్లర్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు.

బి ఎల్ ఓ లు తమ పరిధిలోని ఓటరు జాబితాను పరిశీలించి అర్హులను జాబితాలో ఉంచి అనర్హులను జాబితాలోనుంచి తొలగించాలని ఆదేశించారు. ఇందులో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న 245,46 పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు