Breaking Newsతెలంగాణ
జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
తెలంగాణలో జిల్లాల పునర్విభజన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం పైన ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో జిల్లాల పునర్విభజన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం పైన ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ముందుగా మండలాల రేషనలైజేషన్ ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్ నిర్వహిస్తామని, ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకనే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల ఆధారంగా పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.









