Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయంహైదరాబాద్
సీఎం కేసీఆర్ కు ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేల ధన్యవాదాలు ఎందుకంటే?
సీఎం కేసీఆర్ కు ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేల ధన్యవాదాలు ఎందుకంటే?
హైదరాబాద్ , మనసాక్షి :
పోడు భూముల వ్యవహారానికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా, గిరిజనులకు మేలు కలిగే విధంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పోడు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ధన్యవాదాలు తెలిపిన వారిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, రేఖా నాయక్, బాపూరావు, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు తదితరులున్నారు.









