Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్ఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapalli : చెత్తకుప్పల నుంచి సొంత ఇంటికి.. పరిమళించిన మానవత్వం..!

Nelakondapalli : చెత్తకుప్పల నుంచి సొంత ఇంటికి.. పరిమళించిన మానవత్వం..!

నేలకొండపల్లి, మన సాక్షి:

రోడ్ల వెంబడి చెత్త కుప్పల్లో తింటూ.. వీధుల్లో తిరుగుతుంటాడు.. అండర్ పాస్ బ్రిడ్జి కింద పడుకుంటాడు… ఎవరినీ అడగడు… ఆకలి వేస్తే చెత్త కుప్పల వద్దకు వెళ్తాడు.. .దొరికినది తిని…తన బాధను బతికించేవాడు.. చూడలేక… అన్నం ఫౌండేషన్‌కు అప్పగించారు స్థానికులు. మతిస్థిమితం లేని వ్యక్తి నుంచి మంచి వ్యక్తిగా మారిపోయి.. సొంత ఇంటికి పంపించాడు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రోడ్ల వెంబడి తిరుగుతూ చెత్త కుప్పల్లో దొరికినవి తిని బ్రిడ్జి కింద పడుకుంటాడు… చలికి ఎండగా ఉన్నా మంచం పాన్పు…బట్టలు -లేక. అన్నం పెట్టని వాడు అడగలేడు…మతిమరుపు. సమయం గడిచిపోతోంది. ఈ విషయాన్ని మానవహారం గ్రామస్థులు గమనించారు.

పెద్దలు అన్నం ఫౌండేషన్‌కు సమాచారం అందించగా మార్చి 26న అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావును గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. అప్పటి నుంచి మంచి వైద్యం…మంచి చికిత్స. ఆరు నెలల తర్వాత, అతను మతిస్థిమితం నుండి కోలుకున్నాడు.

సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వివరాలు తెలపగా..ఒంగోలు జిల్లా కొమరోలు మండలం వట్టెవేప మణిపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు జెర్రిపోతుల నాగేశ్వరరావు అని కుటుంబ వివరాల ఆధారంగా ఫౌండేషన్ తెలిపింది. నేలకొండపల్లికి విచ్చేసిన కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పండుగ వాతావరణంలో చక్కగా పనిచేసిన అన్నం ఫౌండేషన్ ప్రతినిధులు వారికి నూతన వస్ర్తాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సభ్యులు ఏటుకూరి రామారావు, చిలబత్తిన వీరబాబు, అబ్దుల్ పచ్చ కృష్ణారావు, పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు