సూర్యాపేట : పేదల దోస్తీ.. బస్తీ దవాఖాన – మంత్రి జగదీష్ రెడ్డి

పేదల దోస్తీ.. బస్తీ దవాఖాన

బస్తీల సుస్తీ ని పోగొట్టేందుకు బస్తీ దవాఖానలు

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట, మనసాక్షి : వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో నే ప్రజలకు ప్రభుత్వ వైద్యం పై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట లో 1 వ వార్డ్ కుడ కుడ లో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంబించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బస్తీలలో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని, బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం తో పాటు పైసా ఖర్చు లేకుండా వైద్యం, 120 రకాలపరీక్షలు, మందులు అందుతున్నాయన్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్ర కెసిఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్తీ దవఖానాల్లో డాక్టర్, నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు.

2014 కు ముందు గత పాలకుల హయం లో మాములు రోగాలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే నే భయపడటం తో పాటు ప్రజలు అనేక అంటు వ్యాధుల తో ఇబ్బంది పడిన పరిస్థితులు ఉండేవన్న మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్య స్థితి గతుల విషయం లో అనేకమైన అభివృద్ధి జరిగిందని మంత్రి అన్నారు. ఎక్కడి కక్కడ మెడికల్ కళాశాలలు, ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం ను అందిస్తున్నారని కొనియాడారు. గతం లో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఆమడ దూరం పారిపోయే రోజుల నుండి ప్రసూతి అంటే ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళాలనుకునే విధంగా వైద్యం రంగం అభివృద్ధి జరిందన్నారు. మండల కేంద్రాల్లో , మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిత్యంపెరుగుతున్న రోగుల తాకిడే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శం అని మంత్రి అన్నారు. వైద్యం, విధ్య విషయం లో ఏ సమాజం అయితే ముందు ఉంటదో ఆ సమాజం ను మంచి సమాజం గా గుర్తింపు లభిస్తుందన్న మంత్రి , ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న వైద్య రంగం కోసం తీసుకున్న అనేక పథకాలు, చర్యల తో రాష్టం ఆరోగ్య తెలంగాణ గా మారిందని అన్నారు.

ముఖ్యమంత్రి ఆకాంక్షల కు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ బస్తీ దవాఖాన లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపు నిచ్చారు. అనంతరం బస్తీ దవాఖాన లో మంత్రి జగదీష్ రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, గుర్రం సత్యనారయణ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి , శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు..