మిర్యాలగూడ : ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవo
మిర్యాలగూడ : ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవo
జాతీయ పతాకావిష్కరణ చేసిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ , మన సాక్షి :
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం నేటితో 76వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండాను శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆవిష్కరించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆవిష్కరించారు, ఈ సందర్బంగా అమరవీరులను స్మరించుకున్నారు, కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,
ALSO READ : సిరిసిల్ల : డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
అడవిదేవులపల్లి జెడ్ పి టి సి కుర్ర సేవ్యా నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బి.ఆర్.ఎస్ నాయకులు మాదర్ బాబా, నామిరెడ్డి యాదగిరి రెడ్డి,
మాజీద్, ఖాజా మొహినుద్దిన్, ఖాదర్, అశోక్, మన్నెం లింగారెడ్డి, ఇరుగు వెంకటయ్య, ఫహిముద్దిన్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ మహిళా అద్యక్షురాలు పెండ్యాల పద్మ, ఎంపీటీసీ కుర్ర కాంతి కృష్ణ కాంత్, రమ, వేణు, పొట్ల వెంకటేశ్వర్లు, ఏలుగుబెల్లి నాగరాజు, పల్నాటి జానకి రెడ్డి, చిన్నం రమేశ్ బాబు, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!











