మిర్యాలగూడలో డెకరేషన్ బ్లేడుతో దాడి , నలుగురిపై కేసు నమోదు
మిర్యాలగూడలో డెకరేషన్ బ్లేడుతో దాడి ,
నలుగురిపై కేసు నమోదు
మిర్యాలగూడ రూరల్, మనసాక్షి : మిర్యాలగూడ పట్టణంలోని క్రిష్ణ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన వివాదంలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై నర్సింహులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
ఫిర్యాదు దారుడు సంతోష్ , తన మిత్రుడు అరుణ్ కలిసి నలభిమ హోటల్ నుండి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో క్రిష్ణ కాలనీ దగ్గర నందిపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ రాము, సూపర్, భార్గవ్, జానపాటి రాము కలిసి తాగిన మైకంలో అడ్డగించి బూతులు తిడుతూ ప్రసాద్ అనే వ్యక్తి అతని చేతిలో ఉన్న డెకరేషన్ బ్లేడ్ తో మాపై దాడి చేశారని తెలిపారు . మిగతావారు కొట్టినారని సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
1. నల్గొండ జిల్లాలో బయటపడిన 700 ఏళ్ల నాటి శిల్పాలు
2. BREAKING : తేనెటీగల దాడితో బిజెపి కార్యకర్త సొప్పరి సందీప్ మృతి
3. హైదరాబాద్ శివారులో దారుణం : పదవ తరగతి విద్యార్థి పై స్నేహితుడు కత్తితో దాడి latest news









