Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

కోడి పందెం స్థావరాలపై పోలీసుల దాడి..!

కోడి పందెం స్థావరాలపై పోలీసుల దాడి..!

రామసముద్రం, మనసాక్షి

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల పరిధిలోని మానే వారి పల్లి సమీపంలోని మామిడి తోట గుడ్డం లో శనివారం కోడి పందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు.  కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న ఎస్సై సి.వెంకట సుబ్బయ్య తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. 11 మంది కోడి పందెం రాయుళ్లతో పాటు, రెండు కోడి పుంజులను, 9260 నగదును, పట్టుకుని సీజ్ చేసి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సి.వెంకటసుబ్బయ్య తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు