Breaking Newsజాతీయం
రాజస్థాన్ లో హత్య, హైదరాబాద్ లో అలర్ట్
రాజస్థాన్ లో హత్య, హైదరాబాద్ లో అలర్ట్
హైదరాబాద్, మనసాక్షి : భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత నుపుర్ శర్మ ఫోటో స్టేటస్ లో పెట్టుకున్నాడని రాజస్థాన్ లోని ఉదయపూర్ లో టైలర్ ను దుండగులు హత్య చేశారు. దుస్తులు కుట్టించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చి టైలర్ ను గొంతు కోసి చంపారు.
టైలర్ హత్యతో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ హైదరాబాదులోని పాతబస్తీతో పాటు పలు ప్రాంతాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి :
1. సీనియర్ నటి మీనా భర్త హఠాన్మరణం, కారణం అదేనా..?
2. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన రైతులు









