రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన : 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్ – latest news
రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన : 12 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్
ఆత్మకూరు, మన సాక్షి : 12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం జయశంకర్ స్వగ్రామం అక్కంపేట లో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కంపేట లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ ను బొంద పెడతామని, ధరణి పోర్టర్ గంగలో కలుపుతామన్నారు. స్వరాష్ట్ర కాంక్ష కు ఉద్యమ ఊపిరిలూదిన ఈ గ్రామం నుంచే టిఆర్ఎస్ పతనానికి రైతులతో కలిసి కదులుతా మన్నారు. రైతులే తన సైన్యం అని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడమే తన గమ్యం ఆని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
1. నాన్న కొన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి మురిసిపోతున్న కొడుకు (వీడియో )
2. BREAKING : పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు గుడ్ న్యూస్ : వయో పరిమితి పెంపు
3. BIG BREAKING : ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ









