Breaking NewsTOP STORIESఅభివృద్దికరీంనగర్రాజకీయం
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
హుజురాబాద్, మనసాక్షి :
విద్యార్థులను మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.










