Modi : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు.. మహబూబ్ నగర్ లో బహిరంగసభ..!
Modi : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు.. మహబూబ్ నగర్ లో బహిరంగసభ..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు 70 మంది సభ్యుల ఖరారు చేసినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా పలువురు నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. కాగా బిజెపి బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో బిజెపి జాతీయ అధ్యక్షులు పర్యటించారు. ఖమ్మం, చేవెళ్లే లో హోం మంత్రి అమిత్ షా ఇటీవల పర్యటించారు.
ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!
కాగా నిజామాబాద్ లో నరేంద్ర మోడీ రాష్ట్ర 29న పర్యటన చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నప్పటికీ కాస్త ఆలస్యం కావడంతో అక్టోబర్ రెండవ తేదీన మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!









