Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsరాజకీయం

మిర్యాలగూడ : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం.. దానివల్లనే ప్రభుత్వానికి ఆర్థిక భారం, బట్టి విక్రమార్క వెల్లడి..!

మిర్యాలగూడ : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం.. దానివల్లనే ప్రభుత్వానికి ఆర్థిక భారం, బట్టి విక్రమార్క వెల్లడి..!

మిర్యాలగూడ,  మన సాక్షి :

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి సందర్శించారు.

8.2.2015 న పవర్ ప్లాంట్ పనులకు పునాది పడింది. 17.10.2015 న పనులు మొదలుపెట్టారు.
2020 అక్టోబర్లో రెండు యూనిట్లు 2021న మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది.

ప్రాజెక్టును అనుకున్న కాలంలో పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, నిత్యం సమీక్షలు లేకపోవడం మూలంగా ఆర్థిక భారం పెరిగింది ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చేనాటికి పవర్ ప్రాజెక్టు అనుమతులు నిరాకరించబడ్డాయి.

50% విదేశీ బొగ్గు మరో 50% స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్ జి టి కి చెప్పారు.. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయి అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదు.

ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్ జి టి కి కావలసిన పబ్లిక్ హియరింగ్ ను ఫిబ్రవరి 20 24న చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చాం. ఫలితంగా రెండో యూనిట్ ఆయిల్ cynkranization పనులు పూర్తి చేసుకున్నము.

మేము అధికారంలోకి వచ్చాక నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వారానికి ఒకసారి సమీక్ష చేపట్టాం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం.. క్యాలెండర్ ఖరారు చేసాం. 31 మార్చ్ 20 25 నాటికి 4000 మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకున్నాం.

రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తిచేయాలని నిర్ణయించాం. మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్లను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన రెండు యూనిట్లు 2025 మార్చి కి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం.

ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుంది అనేది ERC నిర్ణయిస్తుంది. మా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర 6.35 రూపాయలుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం ఇది.

భూ నిర్వాసితులు గొప్ప త్యాగధనులు. భూ సేకరణ పరిహారం చెల్లించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాం.

LATEST UPDATE : 

Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు.. కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

Govt Hospital : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. డిసిహెచ్ వార్నింగ్..!

BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!

మరిన్ని వార్తలు