విజయభేరి మోగిద్దాం.. తరలి రావాలి.. బి ఎల్ ఆర్
విజయభేరి మోగిద్దాం.. తరలి రావాలి.. బి ఎల్ ఆర్
మిర్యాలగూడ, సెప్టెంబర్ 16, మన సాక్షి :
హైదరాబాదు లోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో జరగబోయే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సామాజికవేత్త భత్తుల లక్ష్మారెడ్డి (బీ ఎల్ ఆర్) అన్నారు.
శనివారం ఆయన విజయభేరి విజయవంతం కై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమీక్ష, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎల్ఆర్ మాట్లాడుతూ రేపు హైదరాబాదులో జరగబోయే విజయభేరి బహిరంగ సభకు భారీగా జన సందోహం తరలి రావాలని కోరారు
Also Read : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
మన తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. రేపటి సోనియమ్మ సభకు మనమందరము భారీగా తరలి వెళ్ళు విజయభేరి సభను జయప్రదం చేసి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మన తెలంగాణ దమ్ము ధైర్యాన్ని చాటి చెప్పాలని అన్నారు.
అదేవిధంగా మిర్యాలగూడ నుండి దాదాపుగా 6000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ తరలి వెళ్తున్నారని వారన్నారు. రాబోయే ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఆదివారం విజయభేరి సభకు స్థానిక ఎన్ఎస్పి క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండు , రాజీవ్ చౌక్ మీదుగా ఈదుల గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు .
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ, ఖర్గే , బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. రాబోయే ఎన్నికలకు ఈ సభతో విజయభేరి మోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.









