దుబ్బాక : వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు హల్ చల్..!

దుబ్బాక : వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు హల్ చల్..!

దుబ్బాక,  మనసాక్షి :

గ్రామ పెద్దమనుషులు చేసిన భూ పంచొటి పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు హల్ చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీ నగర్ గ్రామానికి చెందిన పెంబర్తి కనకయ్య కు పాలోల్లతో ఎకరం భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

 

ఇటీవల గ్రామ పెద్దమనుషుల సమక్షంలో భూ వివాదం పరిష్కారమైంది. పరిష్కారమైన భూ పంచోటీ పత్రాలను గ్రామ సర్పంచ్ మాడురి శ్రీనివాస్ వద్ద పెట్టారు. సర్పంచ్ వద్ద ఉన్న పత్రాల్లో ఒక్క జీరాక్స్ కాఫీని ఇవ్వాలని కనకయ్య సర్పంచ్ ను పలుమార్లు అడిగినా ఫలితం లేకుండాపోయింది.

 

పత్రాల కోసం సర్పంచ్ వద్దకు వెళ్ళి అడిగినా, తిరిగినా పట్టించుకోక పోవడంతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో గ్రామస్థులు దుబ్బాక పోలీసులకు సమాచారమిచ్చారు.

 

అప్రమత్తమైన పోలీసులు కనకయ్యను సమస్యను పరిష్కరిస్తామని కిందకు దింపి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు సముదాయించడంతో కనకయ్య రాజిపడ్డాడు.