Godavari : గోదావరి ఉద్రుతిని పరిశీలించిన అధికారులు
Godavari : గోదావరి ఉద్రుతిని పరిశీలించిన అధికారులు
లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచనలు
మంగపేట , మన సాక్షి
గోదావరి వరద ఉద్రుతిని మండల అధికారులు పరిశీలించి, అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్సై తహెర్ బాబా, ఇంచార్జ్ ఎంపీడీఓ పి.శ్రీనివాసులు, ఆర్ఐ కుమారస్వామిలు గోదావరి రేవు ప్రాంతానికి చేరుకుని వరద ఉద్రుతిని పరిశీలించారు.
వరద పెరుగుదలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు సమాచారం ఇస్తూనే మండలంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి ఉద్రుతిని చూసేందుకు ప్రజలు వెల్లి ప్రమాదానికి గురికాకుండా ఉన్నతాదికారుల సూచనల మేరకు రోడ్డుపై భారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తహెర్ బాబా తెలిపారు.
ALSO READ :
1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!
2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?
3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)
ప్రజలు సైతం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రాంతానికి వెల్లవద్దని ఒడ్డుకోతకు గురై ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మండలంలోని కమలాపురం, మండల కేంద్రంలోని పొద్మూరు. వడ్డెర, సీనిమాహాల్ కాలనీ, చుంచుపల్లి, వాడగూడెం, రాజుపేట, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారంలలోని లోతట్టు ప్రాంతాలు సందర్శించి స్థానిక రెవిన్యూ, గ్రామపంచాయతీ అధికారులను అప్రనమత్తం చేసినట్లు తెలిపారు.
ALSO READ :
1. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!
2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!









