Miryalaguda : కార్మికుల హక్కుల సాధనకై కృషి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
Miryalaguda : కార్మికుల హక్కుల సాధనకై కృషి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలం యాగ్గర్ పల్లి గ్రామంలో మేడే సందర్భంగా ఐఎన్టిసి ఆధ్వర్యంలో హమాలీ వర్కర్స్ నిర్వహించిన మే డే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం, కార్మికులకు హక్కుల కోసం 1886 సంవత్సరంలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులందరూ భారీ ఎత్తున ఉద్యమం చేపట్టి ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పనికి తగ్గ ఫలితం, శ్రమకు తగ్గ వేతనం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, ఐ ఎన్ టి యుసి అధ్యక్షులు నక్క నగేష్ ,కార్యదర్శి బంటు రామచంద్రు, యాదిగిరిపల్లి ఎంపీటీసీ అప్పబోయిన, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, వెంకటయ్య, ఐ ఎన్ టి సి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా ,పోలిశెట్టి అజయ్, జిల్లా వెంకటేశ్వర్లు, రామంజి శంకర్, రవి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :









