Miryalaguda : గేదెలను తప్పించబోయి బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి..!
Miryalaguda : గేదెలను తప్పించబోయి బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
బైకుపై వెళ్తుండగా అకస్మాత్తుగా అడ్డు వచ్చిన గేదెలను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం….
జప్తివీరప్పగూడెం గ్రామానికి చెందిన పేయ్యల శీను ( 49) బైక్ పై మిర్యాలగూడ వస్తుండగా గ్రామ శివారులో గేదలు అడ్డు రావడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నల్గొండకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం శవాన్ని తన భార్యకు అప్పగించినట్టు తెలిపారు.
ALSO READ :
Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!
Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?









